రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి

by Sridhar Babu |
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి
X

దిశ, మెట్ పల్లి : రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామ శివారు వద్ద స్థానిక ఓ వైన్ షాప్ ఎదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed