Smitha Sabharwal: హైకోర్టుకు చేరిన స్మితా సబర్వాల్ ట్వీట్ వ్యవహారం

by Prasad Jukanti |
Smitha Sabharwal: హైకోర్టుకు చేరిన స్మితా సబర్వాల్ ట్వీట్ వ్యవహారం
X

దిశ, డైనమిక్ బ్యూరో: అఖిల భారత సర్వీసు ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారడం లేదు. ఈ అంశంపై ఇప్పటికే దివ్యాంగులతో పాటు పలువురు సీనియర్ రాజకీయ నాయకులు స్మితా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాజాగా ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. దివ్యాంగుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని సామాజికవేత్త వసుంధర తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. యూపీఎస్సీ చైర్మన్ కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై విచారణ జరగ్గా పిటిషనర్ కు ఉన్న అర్హతను కోర్టు ప్రశ్నించింది. దీంతో పిటిషనర్ ఒక దివ్యాంగురాలు అని పిటిషనర్ తరపున లాయర్ కోర్టుకు తెలిపారు. దీంతో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed