శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన

by Ramesh N |
శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన
X

దిశ, డైనమిక్ బ్యూరో: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్- చెన్నై విమానంలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఉదయం 7.15 గంటలకు హైదరాబాద్ నుంచి చెన్నై బయల్దేరాల్సిన విమానం గంటలు గడుస్తున్నా కదలకపోడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు.

విమానం ఆలస్యంపై ప్రయాణికులకు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేశారు. విమాన ఆలస్యానికి కారణం చెప్పకుండా అధికారులు దాట వేస్తున్నారని.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

Advertisement

Next Story