CM రేవంత్ రెడ్డి సోదరుడు ఏ హోదాలో అలా చేస్తారు.. పాడి కౌశిక్ రెడ్డి ఫైర్

by Rajesh |
CM రేవంత్ రెడ్డి సోదరుడు ఏ హోదాలో అలా చేస్తారు.. పాడి కౌశిక్ రెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి అన్న ఏ హోదాలో కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయనివ్వటం లేదని మండిపడ్డారు. దీనిపై కోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిపారు. స్థానిక శాసన సభ్యుడు కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేయవచ్చని ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు.

జీవోను కచ్చితంగా ఫాలో కావాల్సిందే అని కోర్టు చెప్పిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఏ హోదాలో సీఎం రేవంత్ సోదరుడు చెక్కులు పంచుతున్నారని సీరియస్ అయ్యారు.సిగ్గుందా మీకు? మీరు గెలిచినట్టే మేము కూడా ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళమే అన్నారు. ఇవాళ మమల్ని ఇబ్బంది పెడుతున్నారు. రేపు మేము అధికారం లోకి వచ్చాక చూపిస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. నన్ను ఇబ్బంది పెట్టండి కానీ, హుజురాబాద్ ప్రజలని ఇబ్బంది పెట్టొద్దని కాంగ్రెస్ నాయకులకు రిక్వెస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed