ఈ నెల 28న ఆయా దేవాలయాల్లో పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రులు.. : పొన్నం ప్రభాకర్

by Rajesh |
ఈ నెల 28న ఆయా దేవాలయాల్లో పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రులు.. : పొన్నం ప్రభాకర్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనుందని మంత్రి పొన్నం అన్నారు. ఈ ఉత్సవాల్లో ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. ముఖ్యమైన దేవాలయాలకు మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. గతంలో అధికారులు మాత్రమే పట్టు వస్త్రాలు సమర్పించేవారని.. ఈ సారి ప్రజల సహకారంతో ఉత్సవాలు నిర్వహిస్తూనే మంత్రులను భాగస్వామ్యం చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చెక్కుల పంపిణీ పూర్తయ్యాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 10% అదనంగా దేవాలయాలకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు.

ఈ నెల 28వ తేదీన దేవాలయాల వారీగా పట్టు వస్త్రాలు సమర్పించే మంత్రుల వివరాలు

శ్రీ లాల్ దర్వాజా సింహవాహిని ఆలయం - డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

శ్రీ అక్కన్న మాదన్న ఆలయం, శాలిబండ - మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

శ్రీ భాగ్య లక్ష్మి ఆలయం, చార్మినార్ - మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి

శ్రీ దర్బార్ మైసమ్మ టెంపుల్ , కర్వాన్ - మంత్రి దామోదర రాజనర్సింహ

శ్రీ మహంకాళి టెంపుల్, మిరాలం మండి - మంత్రి జూపల్లి కృష్ణారావు

నల్ల పోచమ్మ ఆలయం, సబ్జి మండి - మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

శ్రీ కట్ట మైసమ్మ ఆలయం, చిలకలగూడ - మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

శ్రీ ఖిలా మైసమ్మ ఆలయం, ఎన్టీఆర్ నగర్ సరూర్ నగర్ - మంత్రి దనసరి అనసూయ సీతక్క

శ్రీ మహంకాళి సహిత మహకాళేశ్వర స్వామి ఆలయం, నాచారం ఉప్పల్ - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Advertisement

Next Story

Most Viewed