Tadwai natural disaster: తాడ్వాయి అడవుల్లో ప్రకృతి విపత్తుపై అధికారుల సమీక్ష

by Prasad Jukanti |
Tadwai natural disaster: తాడ్వాయి అడవుల్లో ప్రకృతి విపత్తుపై అధికారుల సమీక్ష
X

దిశ, డైనమిక్ బ్యూరో : ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో ప్రకృతి విపత్తుపై అటవీ శాఖ అధికారులు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ఈ సమీక్షలో ఎన్ఏఆర్ సీ, ఎన్ఆర్ఎస్ సీ, ఎన్ డీఆర్ఐ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఆగస్టు 31న ప్రకృతి బీభత్సం కారణంగా తాడ్వాయి అడవుల్లో 85, 125 వృక్షాలు నేలకొరిగాయి. ఈ విపత్తు జరిగిన విధానంపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సుడిగాలుల వల్ల భారీ ఎత్తున చెట్లు కూలిపోవడంపై అధికారులు, సైంటిస్టులు ఈ సందర్భంగా చర్చిస్తున్నారు. ఈ విపత్తుపై అధికారులు సర్వే నిర్వహించారు. తొమ్మిది బృందాలుగా విడిపోయి కూలిన, విరిగిన చెట్లకు నెంబర్లు వేసి లెక్కించారు.

Next Story

Most Viewed