Kishan Reddy : కొత్తగా పార్టీ ఇన్చార్జిగా ఎవరినీ నియమించలేదు : కిషన్ రెడ్డి

by Ramesh N |
Kishan Reddy : కొత్తగా పార్టీ ఇన్చార్జిగా ఎవరినీ నియమించలేదు : కిషన్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీ ప్యవహారాల ఇంఛర్జిగా తరుణ్‌ ఛుగ్‌ స్థానంలో కర్ణాటక నేత అభయ్ పాటిల్‌ను అధిష్టానం నియమించిందని వార్తలు వచ్చాయి. దీనిపై బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన హైదరాబాదులో తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇంచార్జిగా అభయ్ పాటి‌ను నియమించినట్లుగా వార్తలు వస్తున్నాయని తెలిపారు.

కొత్తగా రాష్ట్రానికి పార్టీ ఇన్చార్జిగా ఎవరిని కేంద్ర పార్టీ నియమించలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర పార్టీ ఇన్చార్జిగా కేంద్ర పార్టీ నియమిస్తుందని వెల్లడించారు. బీజీపీ నేత అభయ్ పాటిల్‌ను పార్లమెంట్(2024) ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జిగా కేంద్ర పార్టీ నియమించిందని గుర్తుచేశారు.

Advertisement

Next Story

Most Viewed