- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ప్రమాదవశాత్తు కుంటలో పడి మహిళ మృతి
by Sridhar Babu |
X
దిశ, కామారెడ్డి : ఓ మహిళ ప్రమాదవశాత్తు కుంటలో పడి మృత్యువాత పడిన ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర్ పల్లి పల్లెవాని కుంటలో చోటుచేసుకుంది. దేవునిపల్లి ఎస్సై రాజు కథనం ప్రకారం కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన సుంకం విజయ (48) గురువారం ఉదయం 10 గంటల సమయంలో కలాపీ చల్లెందుకు
పేడ తీసుకురావడం కోసం పక్కనే గల రామేశ్వర్ పల్లి శివారులోని పల్లెవాని కుంట వద్దకు వెళ్లింది. పేడ తీసుకుని చేతులు శుభ్రం చేసుకోవడానికి కుంటలోకి దిగగా కుంటలో జేసీబీతో తవ్విన గుంతలో ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించి మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
Advertisement
Next Story