బాల్కొండలో అన్నపూర్ణమ్మను భారీ మెజారిటీతో గెలిపించండి

by Sridhar Babu |
బాల్కొండలో అన్నపూర్ణమ్మను భారీ మెజారిటీతో గెలిపించండి
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మను భారీ మెజార్టీతో గెలిపించాలని జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ మండల కేంద్రంలో అన్నపూర్ణమ్మకి మద్దతుగా ఎంపీ ధర్మపురి అర్వింద్ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో గంజాయిని విచ్చలవిడిగా సరఫరా చేసి యువత జీవితాలను మంత్రి ప్రశాంత్ రెడ్డి, అతని సోదరుడు నాశనం చేశారని మండిపడ్డారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి పెద్ద అవినీతిపరుడని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి ప్రశాంత్ రెడ్డి అవినీతి చిట్టా బయటపెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు. బాల్కొండలో కాంగ్రెస్ నాయకులు ఊసరవెల్లి రంగులు మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తున్నారని విమర్శించారు. బాల్కొండలో అన్నపూర్ణమ్మని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

అనంతరం బాల్కొండ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, అతని సోదరుడు నియోజకవర్గంలోని యువతను గంజాయికి బానిసలుగా చేస్తున్నారని మండిపడ్డారు. బాల్కొండలో బీజేపీ గెలిచిన వెంటనే గంజాయిని రూపుమాపుతానని అన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ప్రతి వ్యక్తికి న్యాయం జరుగుతుందన్నారు. బాల్కొండలో బీజేపీని గెలిపిస్తే అర్హులందరికీ ఇండ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బాబాపూర్ గ్రామానికి చెందిన ముస్లిం కమ్యూనిటీ మహిళలు, పలువురు నాయకులు అన్నపూర్ణమ్మ సమక్షంలో బీజేపీలో చేరారు. అన్నపూర్ణమ్మకి మద్దతుగా ఆమె చిన్న కోడలు ఏలేటి శ్వేత రెడ్డి ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మల్కాన్నగారి మోహన్, జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్, భీంగల్ పట్టణ అధ్యక్షులు యోగేశ్వర నర్సయ్య, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బండారి లక్ష్మణ్ గౌడ్, పిల్లోళ్ల గంగస్వామి, నవీన్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed