సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేస్తాం

by Sridhar Babu |
సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేస్తాం
X

దిశ, లింగంపేట్ : ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంక్షేమ పథకాల హామీలను పక్కాగా అమలు చేస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు వెల్లడించారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో 127 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారుల ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కచ్చితంగా అమలు చేస్తామన్నారు. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీలు పేదల సంక్షేమానికి లబ్ధి చేకూరే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వెనుకబడిన ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం అసెంబ్లీలో సమస్యలు వివరించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఇప్పటివరకు 120 కోట్ల రూపాయలు మంజూరు చేయించినట్లు తెలిపారు. తన గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలను గుండెలో పెట్టుకొని కాపాడుకుంటానని వెల్లడించారు. కార్యకర్తల కష్ట ఫలితమే తాను అసెంబ్లీకి వెళ్లినట్లు పేర్కొన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా 27 మందికి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గరీబున్నీసా నయీం, జెడ్పీటీసీ ఏలేటి శ్రీలత సంతోష్ రెడ్డి, ఇన్చార్జి తహసీసిల్దార్ చంద్ర రాజేష్, ఎంపీడీఓ మల్లికార్జున్ రెడ్డి తోపాటు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed