అశ్వినికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం...

by Sumithra |
అశ్వినికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం...
X

దిశ, ఆర్మూర్ : పిల్లల భవిష్యత్తు దృష్ట్యా అశ్వినికి న్యాయం చేసేంత వరకు పోరాటం చేస్తామని విజేత మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో అత్త ఇంటి ముందు సాత్పుతే గిర్మాజీ అశ్విని, ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి మహిళా సంఘం మద్దతుతో గురువారం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది.

ఈ సందర్భంగా విజేత మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాలుగా భార్య ఇద్దరు పిల్లలను అరవింద్ దూరం పెట్టడం సమంజసం కాదన్నారు. కోడలు ఇంటికి వస్తుందన్న నెపంతో అత్త ఇంటికి తాళాలు వేసి పరారైంది అన్నారు. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే భయపడే ప్రసక్తి లేదని, అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మహిళా సంఘాల మద్దతుతో పోరాటం చేస్తామన్నారు.

Next Story

Most Viewed