ఆ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను అభినందిస్తున్న: సీఎం చంద్రబాబు

by Mahesh |
ఆ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను అభినందిస్తున్న: సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తొలిసారి తెలంగాణలో అధికారికంగా పర్యటిస్తున్నారు. శనివారం విభజన సమయంలో మిగిలిన సమస్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారు. అనంతరం ఆదివారం తెలంగాణ టీడీపీ నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తాను ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా హైదరాబాద్ ను తయారు చేసినట్లు గుర్తు చేశారు. ముందు చూపుతో తాను ప్రారంభించిన పనిని రాష్ట్ర విభజన అనంతరం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కొనసాగించాయని ఈ విషయంతో ఇరు పార్టీలను అభినందించాలని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed