Viverra : తొర్లికొండలో పునుగుపిల్లి కళేబరం లభ్యం..

by Sumithra |
Viverra : తొర్లికొండలో పునుగుపిల్లి కళేబరం లభ్యం..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం తొర్లికొండలో అరుదుగా కనిపించే పునుగుపిల్లి కళేబరం లభ్యమైంది. గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ పరిసరాల్లో ఆదివారం ఈ పునుగు పిల్లి కళేబరాన్ని స్థానికులు గుర్తించారు. గ్రామంలోని ఆలయ పరిసర ప్రాంతంలో కొద్ది రోజులుగా పునుగుపిల్లి సంచరిస్తోందని, ఈ కళేబరం బహుశా ఆ పిల్లి పిల్లదే అని స్థానికులు గుర్తించారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేకానికి ప్రత్యేకంగా పునుగు పిల్లి తైలాన్నే వాడతారు.

Advertisement

Next Story

Most Viewed