గాలిపటం దారం తెగి ఇద్దరికి తీవ్ర గాయాలు

by Sridhar Babu |
గాలిపటం దారం తెగి ఇద్దరికి తీవ్ర గాయాలు
X

దిశ, భిక్కనూరు : ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులకు గాలిపటం దారం తగిలి తీవ్రంగా గాయపడిన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన సాయి, అరవింద్ లు గ్రామం నుంచి మెదక్ జిల్లా రామాయంపేటకు ద్విచక్ర వాహనంపై భిక్కనూరు మీదుగా వెళ్తుండగా సిద్ధ రామేశ్వర ఆలయ కమాన్ సమీపంలో గాలిపటం దారం తగిలి మెడ, చెవి, చేతి వేళ్లు తెగాయి.

గాలిపటం ఎగురేస్తున్న వారు దారాన్ని గట్టిగా పట్టుకొని పైకి కిందికి బలంగా గుంజడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే నిందితులు పరారయ్యారు. ప్రభుత్వం చైనా మాంజాను నిషేధించినప్పటికీ వ్యాపారస్తులు దానిని చాటుమాటుగా విక్రయించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. గాయపడ్డ ఇద్దరు యువకులను జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కాగా చైనా మాంజా విక్రయిస్తున్న వ్యాపారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story