విద్యుదాఘాతంతో యువకుడు మృతి..

by Sumithra |
విద్యుదాఘాతంతో యువకుడు మృతి..
X

దిశ, మాచారెడ్డి : అంతటా ఆనందం... కానీ ఆ గ్రామంలో పండుగ పూట విషాదం నెలకొంది. విద్యుదాఘాతానికి ఓ యువకుడు బలయ్యాడు. వివరాల్లోకి వెళితే... పాల్వంచ మండలం బండరామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన శినిగిరి రాజేష్ (17) పొలం వద్దకు వెళ్లాడు. సాయంత్రం 3 గంటలకు వెళ్లిన కొడుకు రాత్రి వరకు రాకపోవడంతో పొలం వద్దకు వెళ్ళి చూడగా పొలంలో విగతజీవిగా పడి ఉండడంతో గుండెలవిసేలా రోదనలతో ఆ కుటుంబం విలవిల లాడింది. ఎవరి ఓదార్పు వారి శోకాన్ని ఆపలేకపోయారు. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తే కర్రతో కోతులను వెళ్లగొట్టే ప్రయత్నంలో 11 కేవీఏ విద్యుత్ లైన్ తాకడంతో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్టుగా నిర్ధారించుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు.

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ..

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లనే రాజేష్ మృతి చెందినట్లు గ్రామస్థులు ఆరోపించారు. వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్ద కు వెళ్లి మరణించాడు. రైతుల పొలంలో వైర్లు కిందికి ఉన్నాయని, పోల్స్ వేయాలని ఎన్నిసార్లు చెప్పినా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోలేకపోవడం వల్లనే మృతి చెందినట్టు ఆరోపించారు.

Advertisement

Next Story