భర్తను హత్య చేసిన భార్య..

by Sumithra |
భర్తను హత్య చేసిన భార్య..
X

దిశ, కేసముద్రం : భర్తను భార్య హత్య చేసిన సంఘటన కేసముద్రం మండలం పెనుగొండ గ్రామంలో శనివారం నాడు చోటు చేసుకుంది.ఈ సందర్భంగా ఎస్సై మురళి ధర్ రాజ్ వివరాలను మీడియాకు వెల్లడించారు. కేసముద్రం మండలం పెనుగొండ గ్రామంలో కడప జిల్లాకు చెందిన భార్యభర్తలు బతుకు తెరువు కోసం వచ్చి సుతారి పని చేస్తూ పెనుగొండ గ్రామంలో గత 20 సంవత్సరాల నుండి జీవిస్తున్నారు. మొదటి నుండి అమీనాది రెండో పెళ్లి కావడం వాళ్ళ తన భర్త ప్రశాంత్ అనుమానిస్తూ అక్రమ సంబంధాలు అంటకడుతూ, ఆమీనాకు మొదటి సంబంధానికి పుట్టిన ఇద్దరి పిల్లలు నాకు పుట్టలేదు అని ప్రతిరోజు త్రాగివచ్చి తిడుతూ, కొడుతూ ఉండేవాడని తెలిపారు. ఈ క్రమంలోనే భార్య తన తమ్ముడు అమ్మను ఒప్పించి ముగ్గురు కలిసి ప్రశాంత్ ను చంపాలని నిర్ణయించుకొన్నారన్నారు. లక్కే ప్రశాంత్ భార్య ఆమె తమ్ముడు కడియాల అమీర్ భాష తల్లి కడియాల నూర్జహాన్ పతకం ప్రకారం తేది శుక్రవారం రాత్రి సమయంలో ముగ్గురు కలిసి తాడుతో మెడ బిగించి చంపినారని తెలిపారు.

ఆమీనా కసి తీరక గరిటెను వేడి చేసి తన భర్త ప్రశాంత్ మర్మంగాలను కాచ్చిందని చెప్పారు. ఆ తర్వాత ఊళ్లో ఎవరికి అనుమానం రాకుండా రైల్వే ట్రాక్ మీద పడేద్దామని నిర్ణయించుకొని ఆటోను తెప్పించుకొని వెంటనే ఆటోలో మహబూబాబాద్ రైల్వే గేటు వైపుతీసుకొని వెళ్తుండగా ఆటో డ్రైవర్ కి అనుమానం వచ్చి నిలదీయగా అసలు విషయం బయట పడిందని పేర్కొన్నారు. ఈ విషయం డ్రైవర్ రాము పోలీసులకు తెలియజేశాడని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ఆ కేసులోని ముగ్గురు నేరస్తులను గూడూర్ సీఐ, ఇంచార్జి రూరల్ సీఐ బాబు రావు నిందితులను అరెస్టు చేసి ముగ్గుర్ని రిమాండుకు తరలించారు. భాధ్యతాయుతంగా వ్యవహరించిన ఆటో డ్రైవర్ రాము 100 కు డయల్ కు ఫోన్ చేసి నేరం గురించి పోలీసులకు తెలియజేశాడు. ఈ కేసును చేధించిన మురళీధర్ ను, పోలీస్ సిబ్బందిని ఎస్పీ సుధీర్ రామ్నాద్ కేకన్ అభినందించారు.

Advertisement

Next Story