ఇద్దరు బైక్ దొంగల అరెస్టు

by Sridhar Babu |
ఇద్దరు బైక్ దొంగల అరెస్టు
X

దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగరంతో పాటు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ లు దొంగిలించిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఇంచార్జి ఏసీపీ , సీసీఎస్ ఏసీపీ విజయసారథి తెలిపారు. బుధవారం ఏసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద అనుమానాస్పదంగా ఎలాంటి పత్రాలు లేకుండా బైక్ పై ప్రయాణిస్తున్న నగరంలోని చంద్రానగర్ కు చెందిన న్యాలకంటి చంద్రశేఖర్, వినాయక్ నగర్ లోని శ్రీనగర్ కు

చెందిన ఆకునూరి సతీష్ లను పట్టుకుని విచారించడంతో నగరంలో, ఆర్మూర్ లో గతేడాది డిసెంబర్, ఈ నెలలో జరిగిన నాలుగు బైక్ దొంగతనాల కేసులు కొలిక్కి వచ్చాయని తెలిపారు. న్యాలకంటి శేఖర్ ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తూ, ఆకునూరి సతీష్ కార్పెంటర్ గా పని చేస్తూ జల్సాలకు అలవాటు పడి కుటుంబ పోషణ భారమై దొంగతనాలకు పాల్పడుతున్నారని ఏసీపీ తెలిపారు. వారి వద్ద నుంచి నాలుగు బైక్ లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed