భారీగా పెరిగిన ధరలు.. అధికారులతో చంద్రబాబు రివ్యూ

by srinivas |
భారీగా పెరిగిన ధరలు.. అధికారులతో చంద్రబాబు రివ్యూ
X

దిశ, వెబ్ డెస్క్: సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఉండవల్లి ముఖ్యమంత్రి నివాసంలో జరుగుతున్న ఈ రివ్యూకు మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ ద్వారా చేపట్టిన చర్యలపై ఆరా తీశారు. నిత్యావసర వస్తువుల ధరల భారం తగ్గించేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. డిమాండ్‌కు తగిన విధంగా నిత్యావసర వస్తువుల దిగుమతి, దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన చర్యలపై చంద్రబాబు సమీక్షించారు. ప్రస్తుతం రైతు బజార్ల ద్వారా చేపట్టిన వివిధ అమ్మకాలు, కౌంటర్ల ఏర్పాటుపై చంద్రబాబుకు అధికారులు వివరించారు.

Advertisement

Next Story