- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
చేపట్టిన ప్రతి పనిలో ప్రజలందరూ విజయం సాధించాలి : జిల్లా ఎస్పీ గౌష్ ఆలం
దిశ, ఆదిలాబాద్ : విజయదశమి పర్వదిన వేడుకలు పురస్కరించుకొని జిల్లా ప్రజలు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో, ఆనందోత్సాహాల నడుమ ప్రజలు ఘనంగా దసరా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.శనివారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని ఆయుధ భాండాగారంలో పోలీసు అధికారులతో కలిసి, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సాంప్రదాయబద్ధంగా, దుర్గామాత సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయానికి చిహ్నంగా ఆకాశం వైపు తుపాకితో ఐదు రౌండ్లని కాల్చి విజయదశమిని ప్రారంభించారు. అనంతరం సాయుధ పోలీసు విభాగంలో పనిచేస్తున్న డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ టీం, పోలీసు వాహనాలు తదితర విభాగాల్లో సిబ్బందితో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ప్రజలు ఘనంగా విజయదశమి ఉత్సవాలను జరుపుకోవాలని, జిల్లాలో ప్రశాంత వాతావరణ నెలకొల్పడానికి పోలీస్ శాఖ అహర్నిశలు శ్రమిస్తున్న ట్లు తెలిపారు. జిల్లాలో దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర అర్ధరాత్రి వరకు కొనసాగిన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా పూర్తయ్యిందని తెలిపారు. పోలీస్ శాఖలో ఆయుధాలు కీలక పాత్ర పోషిస్తాయని, సాయుధ బలగాల సంరక్షణలో భద్రపరుస్తారని తెలిపారు. జిల్లా ప్రజలందరికీ విజయదశమి సందర్భంగా విజయం చేకూరాలని కోరారు. ఈ కార్యక్రమంలో వర్టికల్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, టి మురళి, చంద్రశేఖర్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ సిబ్బంది డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ టీం, మోటార్ ట్రాన్స్పోర్ట్ టీం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.