ఇద్దరికి మూడేళ్ల జైలు శిక్ష

by Sridhar Babu |   ( Updated:2024-03-21 15:46:07.0  )
ఇద్దరికి మూడేళ్ల  జైలు శిక్ష
X

దిశ, బాన్సువాడ : వెంకటేశ్వర స్వామి బంగారు ఆభరణాలు దొంగిలించిన ఇద్దరు నేరస్తులకు మూడేళ్ల జైలు శిక్ష పడినట్లు బీర్కూర్ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేదాడి తెలంగాణ తిరుపతి దేవస్థానంలో నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామానికి చెందిన గైని భూమయ్య కుమారుడు గైని కిరణ్, అదేవిధంగా సారంగాపూర్ గ్రామానికి చెందిన గుంజి భూమయ్య కుమారుడు గంగాధర్ లకు బాన్సువాడ మున్సిఫ్ కోర్టు మెజిస్ట్రేట్ కుమారి టీఎస్పీ భార్గవి మూడేళ్ల జైలు శిక్ష, అదేవిధంగా ఒక్కరికి రెండు వందల రూపాయలు జరిమానా విధించారని తెలిపారు.

Advertisement

Next Story