అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటా

by Sridhar Babu |
అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటా
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని 40 వ డివిజన్ లో బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ మీ కుటుంబ సభ్యుడిగా, మీ ఇంట్లో ఒకరిగా మీ ముందుకు వస్తున్నాను అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం కుల, మత, బేధాలు లేకుండా సబ్కా సత్ సబ్కా వికాస్ అనే నినాదం తో ముందుకు సాగుతున్నారని అన్నారు. త్రిబుల్ తలాక్ మైనార్టీ సోదరిమనులకు ఒక వరం అన్నారు. కరోనా సమయం లో నగరంలో ఎంతో మంది మైనార్టీ లకు ముద్ర లోన్ , స్ట్రీట్ విండర్ లోన్ ద్వారా ఉపాధి కల్పించారని తెలిపారు.

బీసీ ముఖ్యమంత్రి బీజేపీ నినాదం అని, ఎస్సీ వర్గీకరణ తో మాదిగ సోదరులకు న్యాయం జరుగుతుందని, ఇలా అన్ని వర్గాల ప్రజలకు బీజేపీ భరోసా కల్పిస్తుంది అన్నారు. సబ్బండ వర్గాల అభ్యున్నతే బీజేపీ లక్ష్యం అన్నారు. అట్టడుగు వర్గాల వరకు బీజేపీ పథకాలు అందుతున్నాయన్నారు. నగరంలో రాబోయే రోజుల్లో బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఓసీ వర్గాలకు సమాన న్యాయం చేస్తామన్నారు. ఒక్క సారి బీజేపీ కి అవకాశం ఇచ్చి నగరంలో కమలం గుర్తు కు ఓటేసి ప్రజలు భారీ మెజార్టీ తో తనని అర్బన్ నియోజకవర్గం నుంచి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా అడుగడుగునా ప్రజలు సూర్యనారాయణకి నీరాజనం పలికారు. ఈ కార్యక్రమం లో 40 వ డివిజన్ నాయకులు కోలవి అనిల్ కుమార్, ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, అసంబ్లీ కన్వీనర్ పంచారెడ్డి లింగం, డివిజన్ నాయకులు సంజీవ్, విష్ణు, శశాంక్, రమేష్ పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Next Story