మొబైల్ షాప్ లో చోరీ

by Sridhar Babu |
మొబైల్ షాప్ లో చోరీ
X

దిశ, లింగంపేట్ : లింగంపేట మండల కేంద్రంలోని అలీ మొబైల్ షాప్ లో గురువారం రాత్రి చోరీ జరిగినట్లు యజమాని సఫివుద్దీన్ తెలిపారు. అర్ధ రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు షాప్ పై భాగంలోని రేకులు తొలగించి లోనికి ప్రవేశించినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం దుకాణం తీయడంతో చోరీ జరిగినట్లు గుర్తించామని బాధితుడు తెలిపారు.

దుకాణంలో పరిశీలించగా రెండు ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు మొబైల్ పరికరాలు అపహరించినట్లు ఆయన తెలిపారు. సుమారు 30 వేల రూపాయల విలువ గల వస్తువులు చోరీకి గురైనట్లు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించగా ఎస్ఐ చైతన్ కుమార్ రెడ్డి, ఏఎస్ఐ రంగారావు తోపాటు పోలీస్ సిబ్బంది సంఘటన స్థలాన్ని సందర్శించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story