డోర్ పగలగొట్టి..డైనింగ్ హాల్ ధ్వంసం

by Naveena |
డోర్ పగలగొట్టి..డైనింగ్ హాల్ ధ్వంసం
X

దిశ భిక్కనూరు :తాళం పగులగొట్టి..అధునాతనంగా నిర్మించిన డైనింగ్ హాల్ పీఓపి షీట్లను ధ్వంసం చేసిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తన స్వగ్రామం కావడంతో.. ప్రభుత్వ పాఠశాల ఆదర్శంగా ఉండాలన్న ఉద్దేశంతో,అప్పట్లో జిల్లాలో ఎక్కడా లేని విధంగా 2 కోట్ల రూపాయలతో అధునాతన హంగులతో పాఠశాలను డెవలప్ చేశాడు. నిర్మాణ పనుల్లో ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా దగ్గరుండి చూసుకొని, పాఠశాల రూపు రేఖలను పూర్తిగా మార్చేశాడు. అయితే ఎలాంటి పొరపాట్లు జరగకుండా భవన నిర్మాణ పనులు, గదుల నిర్మాణం, డైనింగ్ హాల్, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. దసరా పండుగ కావడంతో..స్కూల్ కు హాలిడేస్ ఇచ్చారు. అయితే నిన్న మొన్నటి వరకు పాఠశాలలో క్రీడా పోటీలు కూడా నిర్వహించారు. ఉన్నట్టుండి 17 లక్షల తో నిర్మించిన డైనింగ్ హాల్ కిటికీలను తొలగించి కింద పడేయడమే కాకుండా,హాల్లో ఉన్న ఫ్యాన్లు తొలగించి నేలపై పడేయడం, సీలింగుకు ఉన్న పిఓపి ని ధ్వంసం చేసి కిటికీలను సైతం పగులగొట్టారు. అయితే ఆకతాయిల పనే అయి ఉండవచ్చని కొందరు, కుట్రలో భాగంగానే ఎవరైనా చేసి ఉండవచ్చన్న రకరకాల అనుమానాలను గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గ్రామపంచాయతీ తరపున స్థానిక పోలీసులకు కంప్లైంట్ చేశారు.

Advertisement

Next Story