district SP : మత్తు పదార్థాలు, పేకాట పై ఉక్కు పాదం మోపాలి..

by Sumithra |
district SP : మత్తు పదార్థాలు, పేకాట పై ఉక్కు పాదం మోపాలి..
X

దిశ, కామారెడ్డి : గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, పేకాట, జూదం తదితర వాటి పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఉక్కుపాదం మోపి అణిచివేయాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ పోలీసులను ఆదేశించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. పెండింగ్ లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల పై డీఎస్పీ, సీఐ, ఎస్సైలను కేసులను అడిగి తెలుసుకున్నారు. సమగ్ర విచారణతో నేరస్తులకు న్యాయస్థానం ద్వారా శిక్ష పడే విధంగా పోలీసులు బాధ్యతగా కృషి చేయాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణ పై అన్ని స్థాయిల అధికారులు మరింత దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా పెండింగ్ (అండర్ ఇన్వెస్టిగేషన్) లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సైబర్ క్రైమ్ నేరస్తులను పీటీ వారెంట్ ద్వారా కోర్టులో ప్రవేశపెట్టి సైబర్ బాధితులకు బాసటగా నిలవాలని సూచించారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమిత లిమిట్ లో వుండాలని, గ్రేవ్, నాన్-గ్రేవ్ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలనే విషయాలపై తగు సలహాలు, సూచనలు చేశారు.

ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ను త్వరితగతిన పూర్తి చేసి భాదితులకు అండగా నిలవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించి, ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను ఆక్సిడెంట్ పోర్న్ ఏరియాగా గుర్తించి, సైన్ బోర్డు లను ఏర్పాటు చేయించాలని సూచించారు. తరచూ వెహికిల్ చెకింగ్ నిర్వహిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా ఫేక్ నెంబర్ ప్లేట్స్, నెంబర్ ప్లేట్స్ మార్పు పై ప్రత్యేక దృష్టి సారించి, కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. నేర నియంత్రణతో పాటు, జరిగిన నేరాలను చేదించడంలో ఉపయోగపడే సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ, స్వచ్చంధంగా వారి గ్రామాల్లో, ప్రధాన కూడళ్లలో, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విజిబుల్ పోలీసింగ్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రస్తుతం జరుగుతున్న వివిధ రకాల ఆన్లైన్ మోసాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నరసింహారెడ్డి, డీఎస్పీలు నాగేశ్వరరావు, సత్యనారాయణ, శ్రీనివాసులు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జార్జ్, డి సి ఆర్ బి ఇన్స్పెక్టర్ మురళి, సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed