ఈ నెల 12 నుంచి దేశ గ్రామీణ తపాలా ఉద్యోగుల నిరవధిక సమ్మె...!

by Sumithra |
ఈ నెల 12 నుంచి దేశ గ్రామీణ తపాలా ఉద్యోగుల నిరవధిక సమ్మె...!
X

దిశ, ఆర్మూర్ : భారతదేశంలోని గ్రామీణ తపాలా శాఖలో జీడీఎస్ ల నిరవధిక సమ్మె సందర్భంగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కొరకు కేంద్ర సంఘాలు ప్రయత్నించినప్పటికీ డిమాండ్లు నెరవేర్చే సూచనలు కనబడకపోవడం వలన నిరవధిక సమ్మె తప్ప వేరే మార్గం లేక పోవడంతో నిరవధిక సమ్మె చేసేందుకు దేశంలోని గ్రామీణ తపాలా ఉద్యోగులు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 12వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేస్తున్నట్లు ఆ ఉద్యోగుల సంఘ బాధ్యులు పేర్కొంటున్నారు. ఆర్మూర్ సబ్ డివిజన్ తపాలా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నామని రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మంథిని బీపీఎం ఏ.లింబా గౌడ్, ఆర్మూర్ సబ్ డివిజన్ అధ్యక్షులు మచ్చర్ల బీపీఎం ఎం.రమేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పెర్కిట్ బీపీఎం పి.శ్రీనివాస్ రెడ్డిలు శనివారం తెలియజేశారు. జీడీఎస్ ల డిమాండ్లలో ముఖ్యంగా తమ పనివేళలను 8 గంటలకు నిర్ణయించాలని, పెన్షన్ తో పాటు అన్ని ప్రయోజనాలు మంజూరు చేయాలని, టీఆర్సీఏ రేషనల్ ఫిక్సేషన్ సహా కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని, రెగ్యులర్ ఎంప్లాయిస్ కు ఇచ్చినట్లు వెయిటేజి, ఇంక్రిమెంట్స్ సీనియర్స్ కు ఇవ్వాలి.

12, 24, 36 సంవత్సరాలు పూర్తి చేసిన వారికి ఆర్థిక ఉన్నతి కల్పించాలి. గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజ్ 5 లక్షల పెంచాలని, డిపార్ట్మెంట్ స్టాప్ తో సమానంగా జిడీఎస్ లకు గ్రాట్యూవిటీ పెంచాలి. పెయిడ్ లీవ్స్ 180 రోజుల వరకు దాచుకొని నగదుగా మార్చుకొనే సౌకర్యం కల్పించాలని, జీడీఎస్ కుటుంబ సభ్యులకు వైద్యసౌకర్యం కల్పించాలి. పూన్షన్ కాంట్రిబ్యూషన్ 3% నుండి 10% కు పెంచి రిటైర్డ్ జీడీఎస్ లకు హడాక్ పెన్షన్ మంజూరు చేయాలి. ఇన్ సెంటీవ్స్ /కమిషన్ పద్ధతులు రద్దు చేసి ప్రతి పనిని వర్క్ లోడ్ లోకి తీసుకోవాలి.

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. జీడీఎస్ ల 5 గంటల పనికి సెకండ్ టీఆర్సీఎ ఇవ్వాలి అలాగే వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి. బిజినెస్ టార్గెట్ ల పేరుతో జీడీఎస్ లను వేదించే పద్దతులను సొంత మొబైల్ ఫోన్ లను ఉపయోగించాలనే ఒత్తిడిని ఆపివేయాలి, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా స్లాట్ ఫారంలను అనుసరించాలని బలవంత పెట్టకూడదు. సేవలను విస్తృతం చేయడానికి సత్వరంగా అందించడానికి ఆర్ఐసీటీ డివైజ్ లను ఉపసంహరించి ల్యాప్ టాప్ లు, ప్రింటర్స్, బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ లు బ్రాంచ్ పోస్టాఫీసులకు ఇవ్వాలన్నారు. ఈ డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా న్యాయమైన కోరికలను తీర్చాలన్నారు. లేకపోతే నిరవధిక సమ్మెను మరింత ఉదృతం చేస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed