- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఒకటి చేస్తుందొకటి
దిశ, గాంధారి : కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఒకటి చేస్తుంది ఇంకొకటని, అంతేకాకుండా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది లేదు సచ్చేది లేదు అని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి లో శుక్రవారం వికసిత్ భారత సంకల్ప రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ముచ్చటగా మూడోసారి మోడీ ప్రభుత్వం రావాలని అన్నారు. వికసిద్భారత్ కార్యక్రమం లక్ష్యం వేరే దేశాల పిల్లలు భారత్ కు రావడమే అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి రెండు లక్షల కోట్లు అవసరమవుతుందని,
ఇప్పటికే భారాస ప్రభుత్వం ఏడు లక్షలు అప్పు చేసిందని తెలిపారు. వారి మీద బురద జల్లుతూ గ్యారంటీలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రజలు జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థికి తప్పనిసరిగా ఓటు వేయాలని కోరారు. నరేంద్ర మోడీని ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిని చేయాలని అన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకున్నా తొమ్మిది లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేసిందని అన్నారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే ఏదైనా జరుగుతుందని, అందుకు నిదర్శనమే కామారెడ్డి నియోజకవర్గంలో ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించిన ఘన చరిత్ర ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పైడి ఎల్లారెడ్డి, ఎల్లారెడ్డి భాజాపా ఇంచార్జ్ వడ్డేపల్లి, మహిళా జిల్లా అధ్యక్షురాలు అరుణతార, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.