- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ప్రభుత్వ పాఠశాలలోనే ఉత్తమ విద్య అందుతుంది
దిశ, కామారెడ్డి : అవార్డీ టీచర్స్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా క్యాలెండర్ ను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలోనే ప్రతిభ గల ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యా బోధన అందుతుందన్నారు. విద్యాభివృద్ధికి కృషి చేయడంతో పాటు సామాజిక సేవలో పాలు పంచుకుంటున్న ఆట కార్యవర్గాన్ని అభినందించారు. నీతి వంతమైన, బాధ్యతాయుత మైన, అనంతమైన ఓర్పు వహిస్తున్న అవార్డీ టీచర్స్ అసోసియేషన్ సేవలు ఆదర్శనీయమన్నారు.
వృత్తి పరంగా అంకిత భావం, ప్రవృత్తి పరంగా సామాజిక సేవలు చేస్తున్న ఆట కామారెడ్డి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మనోహర్, మార బాల్ రెడ్డి ల నాయకత్వంలో చేస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు. ఇకముందు అసోసియేషన్ నిర్వహించే అన్ని కార్యక్రమాలకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆట జిల్లా అధ్యక్షులు మనోహర్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్ రెడ్డి, కోశాధికారి హరిప్రసాద్, ఉపాధ్యక్షులు విష్ణు వర్ధన్, రామ్మోహన్, కార్యవర్గ సభ్యులు గిర్మా బోయ్, రాములు, దేవేందర్, వేంకటేష్ పాల్గొన్నారు.