అనుమానస్పదంగా యువకుడు మృతి

by Naresh |
అనుమానస్పదంగా యువకుడు మృతి
X

దిశ, రాజంపేట: మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో అనుమానస్పదంగా చెరువులో మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దాపూర్ గ్రామానికి చెందిన కట్టే రాజు (30) శనివారం ఉదయం గ్రామానికి చెందిన పచ్చంటి సత్తయ్య పొలంలో పురుగుల మందు చల్లడానికి వెళ్లి వచ్చి ఉదయం 10 గంటలకు భాస్కర్ అనే వ్యక్తితో కలిసి ఎల్లాపూర్ తండా వాగు వద్దకు చేపలు పట్టడానికి వెళ్లారు. రాత్రి అయిన రాజు ఇంటికి రాకపోవడంతో మృతుడి తండ్రి బాలయ్య భాస్కర్‌ను ఆచూకీ గురించి అడగగా మృతుడు రాజు, భాస్కర్, సంగీరామ్ అనే వ్యక్తితో కలిసి కళ్లు దుకాణానికి వెళ్ళాము. అక్కడ సంగీరామ్, రాజుల మధ్య గొడవ జరిగిందని తర్వాత రాజు అక్కడి నుంచి ఎటు వెళ్ళాడో తెలియదని చెప్పడంతో మృతుని కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికిన ఆచూకీ లభించలేదు.

తిరిగి ఆదివారం ఉదయం వెతకగా ఊరి చెరువు వద్ద మృతుడి చెప్పులు, ఫోను, డబ్బులు కనిపించడంతో అనుమానంతో చెరువులో గాలించగా మృతదేహం లభ్యమైంది. తన కొడుకు మృతికి భాస్కర్, సంగీరామ్ ,సత్తయ్యనె కారణమని అనుమానంతో మృతుడి తండ్రి బాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ గంగారెడ్డి తెలిపారు.

Advertisement

Next Story