జిల్లాలో సరిపోయేంత ఎరువుల నిల్వలు

by Sridhar Babu |
జిల్లాలో సరిపోయేంత ఎరువుల నిల్వలు
X

దిశ, బోధన్ : నిజామాబాద్ జిల్లాలో యసంగి పంటకు సరిపోయేంత ఎరువుల నిల్వలు ఉన్నాయని, ఎరువుల కొరత రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. యసంగి లో వరి సాగు,నీటి లభ్యత, కావాల్సిన ఎరువులు తదితర అంశాలపై అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. సహకార సంఘాల వద్ద రైతులకు కావల్సినంత నిల్వలు ఉండే విధంగా సొసైటీ కార్యదర్శులకు

కఠినమైన సూచనలు ఇవ్వాలని, ఎరువుల నిల్వల విషయంలో కానీ, రైతులకు ఎరువులను అందించే విషయంలో కానీ ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు సూచించారు. జిల్లాలో ఎక్కడ ఎరువుల కొరత ఏర్పడ్డా దానికి సహకార సంఘాల కార్యదర్శులు, జిల్లా అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. రాబోయే 15 రోజుల వరకు ఎరువుల నిల్వలు ఉండే విధంగా అధికారులు చూసుకోవాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed