బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి శ్రీపాదరావు ఎనలేని కృషి

by Sridhar Babu |
బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి శ్రీపాదరావు ఎనలేని కృషి
X

దిశ, కామారెడ్డి : బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి దివంగత స్పీకర్ శ్రీపాదరావు ఎనలేని కృషి చేశారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శనివారం జిల్లా యువజన, క్రీడల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ దివంగత శ్రీపాదరావు జయంతి నిర్వహించారు. ఈ వేడుకలకు కలెక్టర్ హాజరై శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సర్పంచ్ స్థాయి నుంచి అసెంబ్లీ స్పీకర్ స్థాయి వరకు శ్రీపాదరావు ఎదిగారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా యువజన, క్రీడల అధికారి వై. దామోదర్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో మసూర్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed