ప్రేమ వివాహం విఫలమైందని పురుగుల మందు తాగి ఆత్మహత్య

by Sridhar Babu |
ప్రేమ వివాహం విఫలమైందని పురుగుల మందు తాగి ఆత్మహత్య
X

దిశ, కామారెడ్డి రూరల్ : ప్రేమ వివాహం విఫలమైందని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు, స్థానికుల కథనం మేరకు గత నెల 24వ తేదీన జనగామ గ్రామానికి చెందిన వరప్రసాద్, పూజ ప్రేమ వివాహం చేసుకొని బీబీపేట పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. వరప్రసాద్, పూజలను సముదాయించి పోలీసులు వారిని ఇంటికి పంపించారు. పూజ కుటుంబ సభ్యులు వరప్రసాద్ ను భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు వరప్రసాద్ ను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు.

శనివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందాడు. వరప్రసాద్ మృతికి కారణమైన పోలీసులు, పూజ కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతుని కుటుంబ సభ్యులు, జనగామ గ్రామస్తులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడడంతో పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వచ్చి బాధితులను సముదాయించారు. కానీ వరప్రసాద్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకునే వరకు ఇక్కడి నుండి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు ఆందోళనకారులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.



Next Story

Most Viewed