నేడు నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీటి విడుదల

by Sridhar Babu |
నేడు నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీటి విడుదల
X

దిశ,నిజాంసాగర్ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు ఒకటవ నెంబర్ డిస్ట్రిబ్యూటరీ కాలువ నుండి 49వ కాలువ వరకు నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి మంగళవారం ఉదయం 10 గంటలకు పంట సాగుకు సాగునీటిని విడుదల చేయనున్నారు. ఈమేరకు నిజాంసాగర్ ప్రాజెక్టు ఏఈ శివ ప్రసాద్ తెలిపారు. ఆయకట్టు పరిధిలోని రైతులు ఈ నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా వరద నీటి ప్రవాహం ఎక్కువగా కొనసాగే నేపథ్యంలో నీటి ప్రవాహంలోకి పశువులు, గొర్రెలు దిగకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed