- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
అలీసాగర్ వరకు తాగు నీరు విడుదల
by Kalyani |
X
దిశ,నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి అలీసాగర్ వరకు మంగళవారం ఉదయం 1500 క్యూసెక్కుల త్రాగునీరు విడుదల చేయనున్నట్లు నీటి పారుదల శాఖ అధికారి ఏఈఈ శివ ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ పరిసర ప్రాంత ప్రజలు కాలువలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. అదేవిధంగా ప్రధాన కాలువ తూములు తెరవడం నిషిద్ధమని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా కాలువలో దిగడం,స్నానం చేయడం చేయవద్దని కోరారు. పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Next Story