ప్రజావాణి పునః ప్రారంభం

by Sumithra |
ప్రజావాణి పునః ప్రారంభం
X

దిశ ప్రతినిధి, ‌నిజామాబాద్ : ప్రజాసమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రస్తుతం యధావిధిగా ప్రతి సోమవారం కొనసాగిస్తామని అన్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed