పంద్రాగస్టు వేడుకలకు ముస్తాబైన పోలీస్ పరేడ్ గ్రౌండ్

by Sridhar Babu |
పంద్రాగస్టు వేడుకలకు ముస్తాబైన పోలీస్ పరేడ్ గ్రౌండ్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి, గురువారం ఉదయం 10 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. పంద్రాగస్టు వేడుకకు ప్రజా ప్రతినిధులు,

పుర ప్రముఖులు విచ్చేయనున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఇదివరకే నిర్వహించిన సమీక్షలో అధికారులకు బాధ్యతలను పురమాయించారు. వేదిక, ఎగ్జిబిషన్ స్టాల్స్, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర ఏర్పాట్ల గురించి పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో ఐ.డీ.ఓ.సీలో సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులు పోలీస్ పరేడ్ మైదానంలో విస్తృత ఏర్పాట్లు చేశారు.

Advertisement

Next Story

Most Viewed