ప్రైవేట్ ఫైనాన్స్ లపై పోలీసుల దాడి

by Sridhar Babu |
ప్రైవేట్ ఫైనాన్స్ లపై పోలీసుల దాడి
X

దిశ, లింగంపేట్ : లింగంపేట మండల కేంద్రంలోని పలు ప్రైవేట్ ఫైనాన్స్ లపై గురువారం సాయంత్రం స్థానిక పోలీసులు దాడులు చేశారు. ప్రైవేట్ ఫైనాన్స్ నిర్వహిస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణల పై దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. స్థానిక ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పలు ఫైనాన్స్ లపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైనాన్సుల నిర్వహణ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఏఎస్ఐ రంగారావు, పోలీస్ సిబ్బంది సంపత్ కుమార్, రాజు, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story