- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డితో పోచారం తనయుడి భేటీ
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు పోచారం సురేందర్ రెడ్డి, మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిశారు. శుక్రవారం ఆయన నివాసంలో సురేందర్ రెడ్డి మరికొందరు సుదర్శన్ రెడ్డిని కలవడం విశేషం. సంబంధిత ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలిచినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో జిల్లాలో కాంగ్రెస్ లోకి వలసలు పెరిగాయి.
అదే సమయంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి పెద్ద కుమారుడు పోచారం సురేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి కలవడం చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో విస్తరించి ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న రెండు మండలాల బాధ్యతలను సురేందర్ రెడ్డి చూస్తారనేది అందరికీ తెలిసిందే. అయితే సురేందర్ రెడ్డి కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డి ఎందుకు కలిశారనేది బహిర్గతం కాలేదు. సంబంధిత ఫొటో సోషల్ మీడియాలో పోస్టు చేయగా విపరీతంగా వైరల్ అయింది. కొందరు సురేందర్ రెడ్డి కాంగ్రెస్ చేరుతారంటూ కామెంట్లు చేయడం గమనార్హం.