కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

by Sridhar Babu |
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
X

దిశ, ఆర్మూర్ : కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులైన ప్రజలందరూ సద్వినియోగ పరుచుకోవాలని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. శనివారం ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సభలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాలకు మోడీ గ్యారంటీ వాహనంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు వస్తారన్నారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు అర్హులైన వారందరూ దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీవో వినోద్ కుమార్, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో శ్రీనివాస్ , ఏవో హరికృష్ణ , ఐకేపీ ఏపీఎం గంగారం, ఉపాధి హామీ ఏపీవో సురేష్ , పశువైద్యాధికారి లక్కం ప్రభాకర్ ,పిప్రి సర్పంచ్ అసపురం దేవి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ సామెర సురేష్, ముఖేష్, బీజేపీ నాయకులు పల్లె గంగారెడ్డి, కంచెట్టి గంగాధర్, పిప్రి రోహిత్ రెడ్డి, కేసీ ముత్తన్న పాల్గొన్నారు.

Advertisement

Next Story