డిచ్ పల్లికి పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ సేవలు

by Vinod kumar |
డిచ్ పల్లికి పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ సేవలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ప్రజల సౌకర్యార్థం డిచ్ పల్లి మండల కేంద్రంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఉపకార్య నిర్వాహక ఇంజనీరింగ్ కార్యాలయం ప్రారంభించుకోవడం సంతోషకరమని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, నిజామాబాడిచ్ పల్లికి పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ సేవలు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. డిచ్ పల్లి మండల కేంద్రంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఉపకార్య నిర్వాహక ఇంజనీయర్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బాజిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. సిరికొండ, డిచ్ పల్లి మండల గ్రామాల కలిపి ఉపకార్య నిర్వాహక ఇంజనీయర్ కార్యాలయం ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని, నిజామాబాద్ 1 నిజాంబాద్ 2, డీఈ ఆఫీసులో ఉండే, ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు.

ప్రజలు ముఖ్యంగా కాంట్రాక్టర్లు ప్రజాప్రతినిధులు, వారు చేసిన సీసీ రోడ్స్ బిల్డింగ్స్ నిర్మాణాలకు పనులను పూర్తి చేసి చేయాలన్నారు. ఉపకార్యానిర్వాహక ఇంజనీర్ కార్యాలయానికి సహకరించిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సీఎం కేసీఆర్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story