- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
పద్మశాలి కుటుంబాలకు అండగా నిలుస్తా
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని పద్మశాలి కుటుంబ సభ్యులకు వెన్నంటి ఉండి అండగా నిలుస్తానని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఎంకే ఫంక్షన్ హాల్ లో పద్మశాలి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి రాకేష్ రెడ్డి హాజరై మాట్లాడారు. పద్మశాలీలు ఎవరికి భయపడకండని, కొండ లక్ష్మణ్ బాపూజీ ల పోరాట ప్రతిమను కలిగి ఉండాలని అన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని,
గెలిచిన వెంటనే కుల సంఘాల భవనాలు, పద్మశాలి ఫంక్షన్ హాల్ నిర్మాణం చేయించే బాధ్యత తనది అని అన్నారు. అవినీతి పాలనకు ముగింపు పలికి దేశం కోసం బీజేపీ కి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగపూర్ ఎమ్మెల్యే మోహన్ జి మహతే, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, పాలెపు రాజు, ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, జీవి నర్సింహారెడ్డి, యామాద్రి భాస్కర్ , కలిగోట్ గంగాధర్, ఆకుల రాజు, నూతుల శ్రీనివాస్ రెడ్డి, ధ్యాగ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
పైడి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరికలు..
రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం పలు పార్టీలకు చెందిన నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో ఆర్మూర్ పట్టణ బీఆర్ఎస్ నాయకులు టైలర్ వినోద్, సుద్దాల సతీష్, పట్టణంలోని దయానంద్ నగర్ కాలనీలో బాయ్స్ యూత్, గజేంద్ర యూత్ ల సభ్యులు ఉన్నారు. కాగా ఆత్మీయ సమ్మేళనం అనంతరం పద్మశాలి కుల సంఘం సభ్యులు రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని, పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.