రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారంలో ఉంది.. నాయకులు అధైర్యపడవద్దు

by Mahesh |
రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారంలో ఉంది.. నాయకులు అధైర్యపడవద్దు
X

దిశ, ఆర్మూర్ : రాష్ట్రంలో మన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని.. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు అధైర్యపడవద్దని పీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ( పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ ) మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాద పూర్వకంగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కలిశారు.

ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ.. నాయకులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం మనది అని, అన్ని కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. రానున్న స్థానిక, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా పని చేయాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అధికారం ఉంది అని అందరూ మన పార్టీలోకి వస్తారని, ఆచితూచి అవసరం అయిన చోట మాత్రమే నాయకులను పార్టీ లోకి తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed