'చిన్నపిల్లలను పనిలో పెట్టుకుంటే కేసులు నమోదు చేస్తాం'

by Sumithra |
చిన్నపిల్లలను పనిలో పెట్టుకుంటే కేసులు నమోదు చేస్తాం
X

దిశ, నిజామాబాద్ సిటీ : ఆపరేషన్ ముస్కాన్ అవేర్నెస్ ప్రోగ్రాం నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో నిర్వహించారు. 18 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం, వారితో వెట్టిచాకిరి, భిక్షాటన చేయించవద్దని ప్రజలకు తెలియపరిచారు. ఈ ప్రోగ్రాం దేశం మొత్తంలో నిర్వహిస్తామన్నారు. చిన్న పిల్లలతో పైన తెలిపిన పనులు చేయిస్తే వారి పై కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటక్షన్ ఆఫీసర్ చైతన్య బచ్ పన్ బచావో టీం సోనీ, పవన్, విశ్వనాథ్ అలాగే పోలీసు తరపున సాయిరెడ్డి, ఎస్ఐ వరలక్ష్మి నజ్మాలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed