బస్సు టైరు కిందపడి ఒకరి మృతి

by Sridhar Babu |
బస్సు టైరు కిందపడి ఒకరి మృతి
X

దిశ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ముందు బస్సును గమనించకుండా యూటర్న్ తీసు కుంటుండగా ఇద్దరు వ్యక్తులను బస్సు ఢీకొట్టింది. దాంతో వారు బస్సు వెనుక టైర్ల కింద పడి ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుడు పిట్లం మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుమన్ గా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed