నిజాంసాగర్ నీటి విడుదల

by Sridhar Babu |
నిజాంసాగర్ నీటి విడుదల
X

దిశ,నిజాంసాగర్ : నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న యాసంగి పంట సాగు కోసం ఐదో విడత నీటి విడుదలను మంగళవారం ఉదయం ప్రారంభించినట్లు నీటిపారుదల ఏఈ శివప్రసాద్ తెలిపారు. ప్రధాన కాలువ ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ఆయకట్టు కింద సాగు చేస్తున్న లక్ష 25 వేల ఎకరాల ఆయకట్టుకు ఇప్పటివరకు నాలుగు విడతల్లో 5.91 టీఎంసీల నీటిని విడుదల చేశామని,

ప్రస్తుతం ఐదో విడత నీటి విడుదలను ప్రారంభించామని అన్నారు. ఆయకట్టు పంటలు గట్టెక్కేందుకు ఏడు విడతల్లో 11 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు. రైతులు అవసరాలకు అనుగుణంగా నీటి విడుదలలో మార్పులు ఉండవచ్చని అన్నారు. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు. ప్రాజెక్టులో ప్రస్తుతం1405.00 అడుగులు 17.80 టీఎంసీలకు గాను 1398.60 అడుగులు 9.91 టీఎంసీల నీరు నిలువ ఉందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed