- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
పర్యాటక కేంద్రంగా నాగన్న బావి
దిశ, లింగంపేట్ : లింగంపేట్ మండల కేంద్రంలోని నాగన్న బావిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడించారు. బుధవారం మండల కేంద్రంలోని నాగన్న బావి అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన కట్టడాల పరిరక్షణే ధ్యేయమన్నారు. స్వచ్ఛంద సంస్థలు
పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నాగన్న బావి పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. స్థలాన్ని సర్వే నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. హద్దులకు కంచె ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన వెల్లడించారు. 18 గుంటల భూమిని నాగన్న బావికి కేటాయించినట్లు వెల్లడించారు.ఈ భూమిని పురావస్తు శాఖ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. ఆయనతో పాటు తహసీల్దార్ సుధాకర్, ఎంపీడీఓ మల్లికార్జున్రెడ్డి, ఎంపీఓ ప్రభాకర్ చారి, గిర్దావర్ బాలయ్య, సర్వేర్లు మౌనిక, అభిలాష్ తోపాటు పట్టేదార్ మనోహర్రావు పాల్గొన్నారు.