క్షీణించిన డీఎస్ ఆరోగ్యం.. ఐసీయూలో చేరిక

by Mahesh |
క్షీణించిన డీఎస్ ఆరోగ్యం.. ఐసీయూలో చేరిక
X

దిశ, నిజామాబాద్ సిటీ: కాంగ్రెస్ సీనియర్ నాయకులు డి.శ్రీనివాస్ అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శనివారం సాయంత్రం చేరారు. ఆయనను మూత్ర సంబంధిత సమస్య వల్ల ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆయన తనయుడు, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వెల్లడించారు. తన తండ్రి కోసం ప్రార్థించాలని సోషల్ మీడియా వేదికగా డి ఎస్ అభిమానులను, అనుచరులను కోరారు. ఇటీవల కొంతకాలంగా శ్రీనివాస్ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన ఐసియు‌లో ఉండగా ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed