ఫలితాలకు ఒక రోజు ముందు నగరంలో వెలసిన మోడీ ఫ్లెక్సీ

by Kalyani |
ఫలితాలకు ఒక రోజు ముందు నగరంలో వెలసిన మోడీ ఫ్లెక్సీ
X

దిశ, నిజామాబాద్ సిటీ : గతంలో ఎప్పుడూ లేని విధంగా హోరాహోరీగా సాగిన పార్లమెంట్ రణక్షేత్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారం కోసం నువ్వా నేనా అన్న మాదిరిగా పోటిలో తలపడ్డారు. అయితే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మూడు ప్రధాన పార్టీలు పోటిలో ఉండగా త్రిముఖ పోటీ ఉత్కంఠగా సాగింది. పోలింగ్ అయినప్పటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ల మధ్య గట్టి పోటి ఉంటుందని పలు సర్వేలు విషయాన్ని వెల్లడి౦చాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో సరిగ్గా ఫలితాలకు ఒక రోజు ముందు ప్రధాన చౌరస్తాలో ప్రధాని మోడీ చిత్రంతో కూడిన ఓ ఫ్లెక్సీ ప్రత్యక్ష౦ అయ్యింది. దీంతో ఇ౦దూరు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ కు దారి తీసింది. ధన్యవాద్​ భారత్ అనే శీర్షికతో వెలసిన ఈ ఫ్లెక్సీ పార్టీకి సంబంధించిన వారు పెట్టారా…?, లేదా వేరే ఎవరైనా పెట్టారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Next Story

Most Viewed