- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఆటోను ఢీకొట్టిన ఎమ్మెల్యే కాన్వాయ్
X
దిశ, ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం లింగంపల్లి శివారులో బోధన్ ఎమ్మెల్యే కాన్వాయ్ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో తృటిలో ప్రాణాపాయం తప్పింది. సోమవారం మధ్యాహ్నం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కోటగిరి మండలంలో ఒక కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాన్వాయ్లోని ఓ కారు ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఆటో పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోడ్రైవర్కు గాయాలు కాగా ఆయన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో దాంట్లో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. కాగా, ఈ ప్రమాదంపై రుద్రూర్ ఎస్సై మహేందర్ను వివరణ కోరగా.. ప్రమాదం జరిగింది వాస్తవమేని, ఆటో డ్రైవర్కు గాయాలైతే ఆసుపత్రికి తరలించామని చెప్పారు. కానీ ఈ యాక్సిడెంట్పై మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని తెలిపారు.
Advertisement
Next Story