రాజస్థానీ దాబాలో గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్టు

by Sridhar Babu |
రాజస్థానీ దాబాలో గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్టు
X

దిశ, జక్రాన్ పల్లి : మండలం లోని అర్గుల్ గ్రామ శివారులోని జాతీయ రహదారి పక్కన గల చౌదరి రాజస్థాన్ దాబా యజమాని అశోక్ అలియాస్ దల్లు (26) వద్ద 210 గ్రాముల గంజాయి లభించింది. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా గంజాయి లభించింది. నిందితుడి వద్ద నుంచి ఒక సెల్ ఫోన్​, నాలుగువేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించారు. ఎవరైనా వ్యక్తులు లేదా దాబాలలో గంజాయి అమ్ముతున్నట్టు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీఐ పేర్కొన్నారు. ఆయన వెంట ఎస్సై తిరుపతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story