మద్యానికి బానిసై వ్యక్తి మృతి

by Sridhar Babu |
మద్యానికి బానిసై వ్యక్తి మృతి
X

దిశ, బాన్సువాడ : మద్యానికి బానిసై వ్యక్తి మృతిచెందిన ఘటన బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని తాడ్కోల్ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో చోటు చేసు కుంది. స్థానికంగా నివాసముండే శ్యాంసుందర్ గౌడ్ మద్యానికి బానిసై ఖాళీగా తిరుగుతూ ఉండేవాడు. మంగళవారం ఇంట్లో నుంచి వెళ్లిన శ్యాంసుందర్ బుధవారం ఎల్లయ్య చెరువులో పడి మృతి చెందాడు. భార్య అంబిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed